- అర్హులైన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
- టీజీ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి
Free Coaching: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 5 (మన బలగం): ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ ఫౌండేషన్ కోర్స్కు ఉచిత కోచింగ్ కార్యక్రమాన్ని ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని (12) టీజీ స్టడీ సర్కిల్లో నిర్వహిస్తున్నట్లు టీజీ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. అర్హులైన రాజన్న సిరిసిల్ల జిల్లా నిరుద్యోగ అభ్యర్థులు ఈ నెల 9వ తేదీలోగా www.tgbcstudycircle.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల తల్లిదండ్రుల ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000 లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.2,00,000 లోపు ఉండాలని సూచించారు. అభ్యర్థుల ఎంపిక విధానం రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎంపిక ఉంటుందని వెల్లడించారు. బీసీ-ఏ 18%, బీసీ-బీ 6%, బీసీ-సీ 03%, బీసీ -డీ 18%, ఎస్సీ 15%, ఎస్టీ 5%, ఇతరులు 05%గా సీట్లు కేటాయిస్తామని వివరించారు. ఇంటర్మీడియట్, డిగ్రీ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుందని తెలిపారు. అర్హులైన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ 12, 13, 14 తేదీల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు 75% అటెండెన్స్ ఉన్న అభ్యర్థులకు ప్రతినెలా రూ.1500 స్టైఫండ్ అందిస్తామని తెలిపారు. మరింత సమాచారం కోసం 087232 23004, 93818 88746 నెంబర్లలో సంప్రదించాలని రాజన్న సిరిసిల్ల వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి బి.రాజమనోహర్ రావు సూచించారు.