MLA Medipalli Satyam
MLA Medipalli Satyam

MLA Medipalli Satyam: బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

MLA Medipalli Satyam: మల్యాల, మార్చి 20 (మన బలగం): చొప్పదండి శాసనసభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యం, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మానాల మరియు తకళ్ళపల్లి గ్రామాలకు నూతనంగా ఆర్టీసీ బస్సును ప్రారంభోత్సవం చేశారు. మానాల మరియు తకళ్ళపెల్లి మహిళా సంఘాల సభ్యులు అధిక మొత్తంలో హాజరయ్యారు. సంవత్సరాల నుంచి ఎదురుచూస్తుండగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కలను సాకారం చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌లకు రెండు గ్రామాల ప్రజల కృతజ్ఞతలు తెలిపారు. మానాల నుంచి తక్కల్లపల్లి వరకు మేడిపల్లి సత్యం, బల్మూరి వెంకట్ వారితో ప్రయాణం చేశారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు దొంగ ఆనంద్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బత్తిని మల్లేశ్వరి శ్రీనివాస్ గౌడ్, దార మాదిరెడ్డి, లక్ష్మారెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తిరుపతి, సింగిల్ విండో చైర్మన్ తొట్ల చంద్రశేఖర్, ముత్యాల రామలింగారెడ్డి, ఆర్టీసీ డీఎం, మేక లక్ష్మణ్, నరసింహారెడ్డి, ముప్పారపు, కుల కాని మారుతి, నాగులపేట సంజీవ్, మర్రి లక్ష్మణ్, బండి రవి, బీఎన్ రమణ, స్వామి రెడ్డి, సుల్తాన్ సుదర్శన్, మరాటి లక్ష్మీనారాయణ, మల్లయ్య, శంకర్ గౌడ్, మరాఠీ బుచ్చిరెడ్డి, గంగారెడ్డి గంగారెడ్డి, దిండు ప్రవీణ్, నక్క అనిల్, హరినాథ్, కొండబత్తిని అనిల్, ఖడ్గం వినయ్, శ్రావణ్, నిరంజన్ రెడ్డి, దూడం రామాంజనేయులు, మల్లేశం, కిషన్ రెడ్డి, మూదం శ్రీనివాస్, కొత్తపెళ్లి బాబు, అరుణ్, అధికారులు తాసిల్దార్, ఎంపీడీవో, ఏఈలు, గ్రామ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు, మానల తకల్ల పెళ్లి వీవోఏలు, సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *