Bandi Sanjay: మనబలగం, కరీంనగర్ బ్యూరో: కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా ప్రజలకు అధికంగా లాభం కలిగే విధంగా పని చేయాలని కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ అధికారులను కోరారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లోని ఆడిటోరియం హాలులో కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ అధ్యక్షతన మంగళవారం జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమెలా సత్పతి, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమావేశంలో పాల్గొన్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటి, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ, వైద్య శాఖ, విద్యా శాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖ, రెడ్కో, పరిశ్రమల శాఖ, చేనేత జౌళి శాఖ, ఎంపీ నిధుల పురోగతిపై కేంద్రమంత్రి బండి సంజయ్ అధికారులతో సమీక్షించారు.