Collector Satya Prasad: జగిత్యాల ప్రతినిధి, మార్చి8 (మన బలగం): జగిత్యాల పట్టణ ప్రజలు మున్సిపల్కు చెల్లించాల్సిన ఆస్తిపన్ను, ఇతర పన్ను బకాయిలను వెంటనే చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య సత్యప్రసాద్ కోరారు. శనివారం జగిత్యాల మున్సిపాలిటిలో అత్యధిక ఆస్తి పన్ను బకాయి ఉన్న వారందరి బకాయిలపై కలెక్టర్ చర్చించారు. అనంతరం ఆయా బకాయిదారుల ఇండ్లు, షాపులను ఆకస్మికగా తనిఖీ చేసిన కలెక్టర్ శనివారం సాయంత్రంలోగా బకాయిలను చెల్లించాలని కోరారు. అయినా చెల్లించకుంటే చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ ప్రజలు అందరు సకాలంలో ఆస్తి పన్నులు, ఇతర పన్నులు సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ప్రస్తుతం జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలో రూ.1355.07 లక్షలు (ఎరియర్స్ రూ.572.53 లక్షలు, ప్రస్తుతం రూ.782.54 లక్షలు) మొత్తానికి గాను రూ. 699.80 లక్షలు ఇంటి పన్ను వసూలు చేసినట్లు తెలిపారు. 100 శాతం ఆస్తి పన్ను వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని మునిసిపల్ కమిషనర్, బిల్ కలెక్టర్, వార్డ్ ఆఫీసర్స్కు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వార్డుల వారీగా వార్డు అధికారులు, బిల్ కలెక్టర్ల ద్వారా అత్యధిక బకాయిలు ఉన్న వారందరికీ నోటిసులు జారీ చేసినా చెల్లించకుంటే పురపాలక సంఘ చట్టం 2019 ప్రకారం సీజ్ చేయనున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ చిరంజీవి, రెవెన్యూ ఆఫీసర్ కనకయ్య, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గోపాల్, వార్డు అధికారులు బిల్ కలెక్టర్లు ఉన్నారు.
బరిలోకి దిగిన కలెక్టర్
జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ నేరుగా బకాయిదారులను కలిసి బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. అదే తరుణంలో బకాయిలను సాయంత్రంలోగా చెల్లించని వారందరికీ నోటీసులు జారీ చేసి వారి ఇండ్లను, వ్యాపార సంస్థలను చట్ట ప్రకారం సీజ్ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇలా ఆదేశాలు ఇచ్చిన రెండు గంటల్లోనే మున్సిపల్కు రూ.2 లక్షల 99 వేల 228 బకాయిలు చెల్లింపులు జరిగాయి.