Minister Sridhar Babu: ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 1 (మన బలగం): ధూప దీప నైవేద్య అర్చకుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ఐటీ శాఖ మాత్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అర్చక సంఘ సభ్యులు పాక్స్ చైర్మన్ బుగ్గ కృష్ణమూర్తి శర్మ నేతృత్వంలో మంగళవారం వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రాచర్ల పార్థసారథి శర్మ, ప్రధాన కార్యదర్శి పరాంకుశం రమేశ్, కోశాధికారి కేవీఆర్ వెంకట రమణాచార్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్ గొంగళ్ల రవికుమార్, ప్రచార కర్యదర్శి చర్లపల్లి సీతారాములు శర్మ, గౌరవ సలహాదారులు పేరునండి ఆంజనేయ శర్మ తదితరులు పాల్గొన్నారు.