Prajavani
Prajavani

Prajavani: నేటి నుంచి యథావిధిగా ప్రజావాణి: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

Prajavani: నిర్మల్, మార్చి 9 (మన బలగం): ప్రతి సోమవారం యథావిధిగా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శాసనమండలి ఎన్నికల ప్రవర్తన నియమావళి కారణంగా కొన్ని వారాలుగా రద్దు చేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యల అర్జీలను సమర్పించవచ్చునని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *