Prime Minister Modi: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరై పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఢిల్లీ ఓటర్లు అభివృద్ధి కోరుకుంటున్నారని, అందుకే బీజేపీని గెలిపించారని ప్రధాని మోడీ అన్నారు. 27 ఏళ్లపాటు కాంగ్రెస్, ఆమ్ఆద్మీపార్టీ పాలన చూసిన ఢిల్లీ ప్రజలు బీజేపీకి అవకాశం కల్పించారని వెల్లడించారు. భారీ విజయాన్ని అందించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. చరిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టిన సోదరసోదరీమణులకు అభినందనలు తెలిపారు.