Samagra Shiksha Employees Protest
Samagra Shiksha Employees Protest

Samagra Shiksha Employees Protest: శాంతియుత ర్యాలీతో సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన

Samagra Shiksha Employees Protest: జగిత్యాల ప్రతినిధి, జనవరి 2 (మన బలగం): సమగ్ర శిక్ష ఉద్యోగులు తమను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ గురువారం శాంతియుత మహా ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. తమ న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలని కలెక్టర్ కార్యాలయం ఎదుట నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ సత్యప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి వెంటనే తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని, అప్పటివరకు పేస్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

సమగ్ర శిక్ష ఉద్యోగులకు అండగా ఉంటా: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి సత్యనారాయణ
సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్య పరిష్కార సాధనకు అండగా ఉంటానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పోలు సత్యనారాయణ పేర్కొన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెలో గురువారం పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *