Ellareddypet Press Club: ఎల్లారెడ్డిపేట, జనవరి 16 (మన బలగం): ఎల్లారెడ్డిపేట మండల ప్రెస్క్లబ్ నూతన కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక సాయిమణికంఠ గార్డెన్స్లో సమావేశమైన పాత్రికేయులు మండల అధ్యక్షునిగా గౌరీశంకర్, ఉపాధ్యక్షులుగా ఒగ్గు బాలరాజు యాదవ్, కందుకూరి రవి, ప్రధాన కార్యదర్శిగా శ్యామంతుల అనిల్, కార్యదర్శులుగా రామోజీ శేఖర్, కట్టెల బాబు, సంయుక్త కార్యదర్శులుగా శ్రీ రామోజీ ప్రవీణ్, కులేర్ కిషోర్, కోశాధికారిగా మహమ్మద్ లతీఫ్, ముఖ్య సలహాదారుడిగా బండారి బాల్ రెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషిచేస్తానని తెలిపారు. నూతన కమిటీకి పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు అభినందనలు తెలిపారు.