Tributes to Manmohan Singh: ఎల్లారెడ్డిపేట, డిసెంబర్ 28 (మన బలగం): భారత మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కర్త మన్మోహన్ సింగ్కు శనివారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులూ కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారత ఆర్థిక శక్తి పెంపొందించి దేశ ప్రగతిని చాటి చెప్పిన మన్మోహన్ సింగ్ ఆశయాలను కొనసాగిస్తామని, మన్మోహన్ సింగ్ అమర్ హై అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పందిర్ల లింగం గౌడ్, మిరియాలు కార్ చందు, బండారి బాల్ రెడ్డి, గంట వెంకటేశ్ గౌడ్, గుర్రపు రాములు, పందిర్ల శ్రీనివాస్ గౌడ్, షేక్ నవాబ్, మేగి నరసయ్య తదితరులు పాల్గొన్నారు.