Palabhishekam for Modi's film
Palabhishekam for Modi's film

Palabhishekam for Modi’s film: మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

Palabhishekam for Modi’s film: రాయికల్, డిసెంబర్ 7 (మన బలగం): నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని నిజామాబాద్, జగిత్యాల్ జిల్లాలకు జవహర్ నవోదయ విద్యాలయాలు మంజూరు కావడంపై బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. జగిత్యాల్ నియోజకవర్గం రాయికల్ పట్టణంలోని అంగడి బజార్‌లో పట్టణ, మండల శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అర్వింద్‌లకు కృతజ్ఞతలు తెలుపుతూ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, జగిత్యాల నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ బోగ శ్రావణి, రాయికల్ పట్టణ అధ్యక్షులు కల్లెడ ధర్మపురి, రాయికల్ మండల అధ్యక్షులు అన్నవేని వేణు, పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, మంగళారపు లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీటీసీలు ఆకుల మహేశ్, రాజనాల మధు, శ్రీకాంత్ రెడ్డి, కంబోజి రవి, సామల సతీశ్, బన్న సంజీవ్, కురుమ మల్లారెడ్డి, మరియు పట్టణ మరియు మండల పదాధికారులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *