కోర్టు డ్యూటీ ఆఫీసర్లతో సమీక్షా సమావేశం
SP Janaki Sharmila: నిర్మల్, జనవరి 25 (మన బలగం): అవసరమైన న్యాయ నిపుణుల సలహాలతో దోషులకు శిక్ష పడేలా చూడాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. నిర్మల్ జిల్లాలోని పోలీస్ కార్యాలయం శనివారం నిర్మల్ జిల్లా సబ్ డివిజన్లోని కోర్టు డ్యూటీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రస్తుతం కోర్టులో పెండింగ్ ఉన్న కేసుల వివరాలు తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలు సూచించారు. ప్రాసిక్యూషన్ అధికారుల సహాయ సహకారలు తీసుకుంటూ కచ్చితమైన సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టి దోషులకు శిక్ష పడేలా చూడాలన్నారు. పెండింగ్ కేసులలో తొందరగా ఛార్జ్ షీట్లను కోర్టులో జమ చేసి తొందరగా కోర్టులో కేసు విచారణ కొనసాగేలా చూడాలన్నారు. ఒక్క దోషి కూడా తప్పించుకోకుండా సాక్షులను ప్రవేశపెట్టాలని, ఇందుకోసం ప్రాసిక్యూషన్ అధికారుల సూచనలు పాటించాలన్నారు. కార్యక్రమానికి నిర్మల్ జిల్లా ఎస్పీతో పాటు భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, నిర్మల్ జిల్లా ఏఎస్పీ రాజేష్ మీన మరియు ఇతర కోర్టు డ్యూటీ ఆఫీసర్లు పాల్గొన్నారు.
