Additional Collector Faizan Ahmed: నిర్మల్, మార్చి 19 (మన బలగం): ఉన్నత లక్ష్యం చేరుకోవాలంటే క్రమశిక్షణతో పాటు చక్కని ప్రణాళికతోనే సాధ్యమని అడిషనల్ కలెక్టర్ ఫైజన్ అహ్మద్ అన్నారు. నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం విద్యార్థులకు సివిల్ సర్వీసెస్ విజయం సాధించడానికి ఎలా సన్నద్ధం కావాలో సూచించారు. క్రమశిక్షణ ప్రణాళికతో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు. సమకాలీన అంశాలపై పట్టు సాధించాలని అకడమిక్ పుస్తకాలను చదవడం ప్రయోజనం కలుగుతుందని పెర్కొన్నారు. విద్యార్థులు అడిగిన పలు సందేహలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్, డాక్టర్ గంగాధర్ సమన్వయ కర్తలు రమేశ్, అర్చన, సూర్యసాగర్, హేమలత, సుభాష్, శ్రీహరి, రజిత, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.