Fine rice: ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 1 (మన బలగం): రాజన్న సిరిసిల్ల జిల్లాలో పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం ఇస్తుందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని అన్నారు. ధనవంతులు తింటున్న బియ్యాన్ని పేద ప్రజలకు అందించాలని దృఢసంకల్పంతో ఈ కార్యక్రమాన్ని దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రారంభించినట్లు తెలిపారు. ఒకవైపు లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ రాజీవ్ యువ వికాసం కింద ఎంతోమంది యువకులను ఆదుకునే విధంగా ఈ నెల 14 వరకు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఇచ్చిందన్నారు. ఈ నెల మొదటి వారంలో ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభిస్తామని పేద ప్రజలు అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాడి రామ్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, డైరెక్టర్లు మెండే శ్రీనివాస్, చెటుపల్లి బాలయ్య, సూడిద రాజేందర్, నాయకులు గంట బుచ్చగౌడ్, చెన్ని బాబు, బండారు బాల్ రెడ్డి, పందిర్ల శ్రీనివాస్, దండు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.