Anniversary: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 10 (మన బలగం): రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి ఎంపీపీఎస్లో గురువారం వైభవంగా వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచే విధంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పాటలు, నృత్యాలు, నాటకాలు, వినోద కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా సెస్ డైరెక్టర్ ఎం.మల్లేశం, మాజీ ఎంపీటీసీ అరుణ్, మండల విద్యాధికారి టి.శ్రీనివాస్, ఏఎంసీ వైస్ చైర్మన్ లక్ష్మణ్, ఏఏపీసీ చైర్మన్ స్వర్ణలత, ప్రెస్క్లబ్ అధ్యక్షుడు జోసెఫ్ ఉపాధ్యక్షుడు సతీశ్ హాజరయ్యారు. అలాగే ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం.ఉదయలక్ష్మి, ఉపాధ్యాయులు లావణ్య, రజిత, ప్రవీణ, మౌనిక, మనోజ్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని నిర్వహించిన పాఠశాల సిబ్బందికి, పాల్గొన్న తల్లిదండ్రులకు, విద్యార్థులకు అతిథులు అభినందనలు తెలిపారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరికీ ఉందని వారు సూచించారు. విద్యార్థులు తమ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఇది మంచి వేదికగా నిలిచింది. ఈ వేడుక స్నేహపూర్వక వాతావరణంలో ముగిసింది.