76 sheep died due to lightning: నిర్మల్, అక్టోబర్ 17(మన బలగం): పిడుగుపాటుతో 76 గొర్రెల మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం రాంసింగ్ తండాలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చౌహన్ రోజులాగే గొర్రెలను మేతకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం ఒక్కసారిగా కురిసింది. అదే సమయంలో పిడుగుపాటుకు 76 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. కళ్ళముందే గొర్రెలు చనిపోవడంతో ప్రభుత్వం నష్ట పరిహారం అందించాలని కన్నీరుమునిరయ్యాడు.