Gaon-Basti Chalo: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 11 (మన బలగం): రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని బాబాయి చెరువు తండా గ్రామపంచాయతీలో
గావ్, బస్తీ చలో కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు మాలోత్ లక్ పతి నాయక్,ఇంచార్జ్ మాడుగుల లింబద్రి ఆధ్వర్యంలో బస్తీ ప్రజలతో సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో మోడీ గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను గ్రామాల్లో ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పిట్ల నాగరాజు, బోడ వెంకట్, మాలత్ ప్రకాష్, బానోత్ పెద్దరాజు, రఘుపతి,రామ్ రెడ్డి అరవింద్ తదితరులు పాల్గొన్నారు.