Bike Accident
Bike Accident

Bike Accident: పంట పొలాల్లోకి దూసుకెళ్లిన బైకు: వ్యక్తి మృతి

Bike Accident: ఎల్లారెడ్డిపేట, డిసెంబర్ 23 (మన బలగం): ఎల్లారెడ్డిపేట మండలంలోని రగట్లపల్లి మూల మలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన సోమవారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన జగన్ ద్విచక్రవాహనంపై వెళుతూ రాగట్లపల్లి మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి పంటపొలాల్లో పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసగౌడ్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *