Donation: ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 24 (మన బలగం): జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న మార్కండేయ మందిర నిర్మాణానికి సోమవారం చైతన్య నగర్కు చెందిన అడ్వకేట్ గజెల్లి రాందాస్-మాధవి దంపతులు రూ.25,116 ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు ద్యావనపల్లి రాజారాం, ఉపాధ్యక్షులు సంకు ఆనంద్, అన్నం నాగరాజ్, కోశాధికారి బేతు భాస్కర్, సహాయ కార్యదర్శి నడికట్ల సత్యనారాయణ, సాంస్కృతిక కార్యదర్శి వాసాల నరేశ్, కార్యవర్గ సభ్యులు గురుడు హన్మాండ్లు, దేవాలయ కమిటీ సభ్యులు వడ్డేపల్లి చిన్న చిన్నయ్య, రాంపల్లి శ్యామ్ మరియు ఆడెపు రమణ, పసునూరి వివేకానంద్, గాజంగి శ్రీనివాస్, రాంపల్లి పరంధాము, కుడిక్యాల గంగాధర్, గురుడు రాంప్రసాద్, వంగరి ద్విజేంద్రనాథ్, బేతు దుర్గాప్రసాద్, ద్యావనపల్లి మణి, గుండేటి కన్నయ్య, ద్యావనపల్లి శ్యామ్ పాల్గొన్నారు.