Jagityala District Collector
Jagityala District Collector

Jagityala District Collector: లిస్టులో పేర్లు రాకుంటే ఆందోళన చెందొద్దు : జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

Jagityala District Collector: జగిత్యాల ప్రతినిధి, జనవరి 22 (మన బలగం): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న నాలుగు పథకాలలో లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని, దరఖాస్తు చేసినా లిస్టులో పేర్లు రాకుంటే అందోళన చెందొద్దని, తిరిగి దరఖాస్తు చేసుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. బుధవారం జగిత్యాల రూరల్ మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో కలెక్టర్ పాల్గొన్నారు. రాష్ర్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. అలాగే అర్హులైన పేదవారికి ఏర్పాటు చేసిన గ్రామసభల ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. అలాగే గ్రామ సభలలో 4 పథకాలకు ద్వారా ఎంపిక చేసిన అర్హుల జాబితా గ్రామ సభలు అర్హుల పేర్లను ప్రవేశపెట్టాడం జరిగిందనారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ నాలుగు పథకాల ద్వారా అధికారులందరూ క్షేత్రస్థాయిలో సర్వే చేసి అర్హులను జాబితా తయారు చేశారన్నారు. గ్రామసభ ఆమోదంతో అర్హత పొందిన వారికి ఈ పథకాలు వర్తింపజెస్తారని తెలిపారు. ఇంకా లిస్టులో ఈ గ్రామంలో పేర్లు రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసాలు పథకాలు గ్రామసభలలో ఏర్పాటు చేసే కౌంటర్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపారు. జనవరి 26వ తారీఖు నుంచి ఈపథకాలు ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభిస్తుందని తెలిపారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు నిరంతర ప్రక్రియ అని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి నిరుపేదలకు ప్రతి పథకాన్ని అందజేస్తుందని అధికారులందరు క్షేత్రస్థాయిలో అర్హులను గుర్తించి ప్రతి పథకానికి వర్తింపజేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *