Essay writing competitions: నిర్మల్, జనవరి 23 (మన బలగం): జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ఆర్టీసీ నిర్మల్ డిపో ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్థులకు ఆర్టీసీ డిపోమేనేజర్ ప్రతిమారెడ్డి వ్యాస రచన పోటీలు నిర్వహించారు. విద్యార్థులు బైకులపై వెళ్ళేటప్పుడు ట్రిపుల్ రైడింగ్ చెయ్యొద్దని, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపొద్దని, ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దని, విద్యార్థులకు సచించారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్, అధ్యాపకులు, ఆర్టీసీ కంట్రోలర్లు రాజేందర్, రాజన్న పాల్గొన్నారు.