Farmer loan waiver
Farmer loan waiver

Farmer loan waiver: రైతు రుణమాఫీ ఎప్పుడో ముఖ్యమంత్రి చెప్పాలి

  • అప్పుడు ఇప్పుడు అంటూ కాలయాపనేనా
  • లక్ష్మీపూర్ గ్రామ రైతుల డిమాండ్
  • రైతు రుణమాఫీపై కలెక్టర్ వినతిపత్రం

Farmer loan waiver: జగిత్యాల ప్రతినిధి, జనవరి 27 (మన బలగం): రేవంత్ రెడ్డి 17 నిమిషాల వ్యవధిలో రెండు నాలుకల తీరు విధానం సరైన కాదని, రైతు రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలని లక్ష్మి పూర్ రైతులు డిమాండ్ చేశారు. సోమవారం జగిత్యాల రూరల్ మండలం లక్ష్మిపూర్ రైతులు రుణమాఫీ ఎప్పుడు చేస్తారో చెప్పాలనే డిమాండ్‌ను ముఖ్యమంత్రి ముందు ఉంచి ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. అనంతరం రైతులు మాట్లాడుతూ జనవరి 27వ తేదీన రైతు భరోసా ఇస్తానని మాట ఇచ్చి అదే సభలో 17 నిమిషాల తర్వాత మార్చు 31 వరకు రైతు భరోసా ఇస్తానని మాట చెప్పడం రెండు నాలుకల ధోరణి సీఎం రేవంత్ రెడ్డి అని రైతులు విమర్శించారు. రైతు రుణమాఫీ అయిందని చెప్పి అబద్ధపు ప్రచారాలు జరుగుతున్నాయని, కానీ ఇప్పటివరకు ఎంత రుణమాఫీ అయినది ఎందరికి అయ్యిందో తెలుపాలని కోరారు. రుణమాఫీ ఎంత మంది రైతులకు అయింది? ఇంకా ఎంత మంది రైతులకు రుణ మాఫీ కావాల్సింది ఉంది? ప్రకటించాలన్నారు. లక్మిపూర్ గ్రామంలోని 200 మంది రైతులు ఇప్పటివరకు రుణమాఫీ కాని వారు ఉన్నారని పేర్కొన్నారు. కొందరి రైతులకు 60 శాంతం మాత్రమే రుణ మాఫీ అయిందని, ఇంకా 40% రుణ మాఫీ కావాల్సి ఉందన్నారు.

ఇప్పటివరకు అయినా రుణమాఫీ ఇంకా మిగిలిన రుణమాఫీ ఎప్పటివరకు చేస్తారో చెప్పాలని రైతులు డిమాండ్ చేశారు. రైతులు తీసుకున్న రుణాలు లక్ష రూపాయల లోపు ఉన్న రైతులు, రెండు లక్షల రూపాయల లోను తీసుకున్న రైతులు ఉన్నారన్నారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా లక్ష రూపాయల లోపున్న రైతులకు ఒకేసారి రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చారు. కానీ లక్ష రూపాయల లోపు ఉన్న రైతులకు 60% మాత్రమే రుణమాఫీ అయిందని ఇంకా రెండు లక్షల లోన్ తీసుకున్న రైతులకు కూడా ఇలానే 60% రుణమాఫీ అయినది వారు హామీ ఇచ్చిన ప్రకారం లక్ష రూపాయల లోపు లోను తీసుకున్న వారికి కూడా ఓకే విడతలో రుణమాఫీ చేయలేదు కనీసం ఎప్పుడు చేస్తారో ఇకనైనా చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలలో ఎప్పుడూ చేస్తారో ఎలాంటి స్పష్టమైన హామీ లేదని ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం అంటూ కాలయాపన చేయడం పరిపాటి మారిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు నాయకుడు పన్నాల తిరుపతిరెడ్డి, జగిత్యాల జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు వెంకటరెడ్డి, రైతు సంఘం నాయకులు గడ్డం సత్తన్న అత్తిని లింగన్న, జయంత్ రెడ్డి విజయ్, గడ్డం గోపాల్ రెడ్డి, లింగారెడ్డి తిరుపతిరెడ్డి, దశరథ రెడ్డి, మామిడి చిన్న గంగారెడ్డితోపాటు రైతు నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *