Great job: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, మార్చి 3 (మన బలగం): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని అయ్యోరుపల్లి గ్రామానికి చెందిన నేదూరి భారత అనే మహిళ ప్రమాదవశాత్తు బావిలో పడింది. స్థానికులు గమనించి వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. వేములవాడ ఎస్ఎఫ్ఓ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది ఘటన స్థానిక చేరుకుని ప్రాణాలకు తెగించి మహిళను రక్షించారు. మంచం సహాయంతో బావిలో నుంచి మహిళను బయటకు తీసి వెంటనే 108లో అస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా స్థానికులు అగ్నిమాపక శాఖ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో లీడింగ్ ఫైర్మన్ రాజేంద్రప్రసాద్, ఫైర్మ్యాన్ శంకర్, ప్రేమ్ చంద్, ఉపేందర్, చంద్రశేఖర్ ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు.