Inspection of school building site: నిర్మల్, ఫిబ్రవరి 19 (మన బలగం): సెక్రటరీ బోర్డ్ ఆఫ్ ఇంటర్ మీడియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ కృష్ణ ఆదిత్య యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు సమీకృత గురుకుల పాఠశాల భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. బుధవారం సాయంత్రం దిలావర్పూర్ మండలం సిర్గాపూర్ గ్రామ సమీపంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన సముదాయానికి కేటాయించిన సర్వే నెంబరు 664 లో గల 17 ఎకరాల 9 గుంటల భూమిని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్తో కలిసి ఆయన పరిశీలించారు. భవన నిర్మాణానికి సంబంధించి స్థల సేకరణ, తదితర అంశాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనాల నిర్మాణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. భవన నిర్మాణాలను అన్ని హంగులతో నిర్మిస్తామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డిఓ రత్నకళ్యాణి, ఆర్అండ్బి ఈఈ అశోక్ కుమార్, డిఐఈఓ పరశురాం, డిఈ గంగాధర్, తాహసిల్దార్ స్వాతి, ఏఈ తుకారం, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.