Nirmal Collector Abhilash Abhinav calls for peaceful Ganesh Shobha Yatra: నిర్మల్ పట్టణంలోని భాగ్యనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన గణేశుని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం దర్శించుకున్నారు. గణేశుని వద్ద ప్రత్యేక పూజలు చేశారు. గణేశ్ మండప నిర్వాహకులు కలెక్టర్ను శాలువాతో సన్మానించి, మెమొంటోలను అందజేశారు. పూజారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నిర్మల్ పట్టణంలో వినాయక శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలన్నారు. వినాయకుని నిమజ్జనం సజావుగా సాగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని అన్నారు. అనంతరం సమీపంలో గల రాధాకృష్ణ మందిరంలో కలెక్టర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, తహసీల్దార్ రాజు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.