Whip Adluri Laxman Kumar: ధర్మపురి, జనవరి 3 (మన బలగం): రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మన్ కుమార్ శుక్రవారం హైదరాబాద్లో కలిసారు. ధర్మపురి మండలంలోని పలు గ్రామాల్లో గోదావరి లిఫ్ట్లపై ఆధారపడి పంటలు పండిస్తున్నారని, కొన్ని పరిస్థితుల కారణంగా గోదావరిలో నీరు లేక సాగుకు ఇబ్బంది ఎదురవుతోందని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. రైతులను ఆదుకునే విధంగా ఒక టీఎంసీ నీటిని గోదావరిలోకి వదలాలని కోరుతూ వినతిపత్రం అందజేసారు.