Palabhishekam: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, జనవరి 28 (మన బలగం): రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు గద్దరాశి భగ వంతం ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ పద్మ శ్రీ అవార్డు అందుకున్న సందర్భంగా ఆయన చిత్రపటానికి పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదిగ, మాదిగ ఉప కులాలకు 59 కులాలకు వర్గీకరణ కోసం 30 సంవత్సరాలుగా పోరాటం చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డు అందించారన్నారు. నిరుపేద బడుగు బలహీనర్గాలకు కోసం, వికలాంగుల సంక్షేమం, పోరాటం చేస్తున్న వ్యక్తి అని కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల నాయకులు రాజేశ్, చంద్రయ్య, రాజం, రాజయ్య, కృష్ణ, డేవిడ్, రాజరాం, అశోక్ ఎల్లయ్య, దేవ రాజు ఉన్నారు.