నిర్మల్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజేందర్
Nirmal DM and HO: హెచ్ఐవీ, ఎయిడ్స్ రహిత జిల్లాగా మారుద్దామని నిర్మల్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజేందర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని వైద్య ఆరోగ్యశాఖ సమావేశ మందిరంలో జిల్లాలోని పీహెచ్సీలు, సబ్ సెంటర్ల మల్టీ లెవెల్ హెల్త్ ప్రొవైడర్, ఏఎన్ఎంలకు హెచ్ఐవీ ఎయిడ్స్ అవగాహన, కార్యాచరణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజేందర్ మాట్లాడుతూ, జిల్లాలో హెచ్ఐవీ వ్యాధిపై పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం జిల్లా ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, హెచ్ఐవీ, ఎయిడ్స్ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. జిల్లా ఎయిడ్స్ నియంత్రణ ప్రోగ్రాం అధికారి నాగరాజు మాట్లాడుతూ, హెచ్ఐవీ నివారణకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకొని, పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రాజా రమేశ్, జిల్లా మాస్ మీడియా అధికారి బారె రవీందర్, ఐసీటీసీ కౌన్సిలర్లు ఎల్లేశ్, సుదర్శన్, రామచందర్, శ్రీనివాస్, ల్యాబ్ టెక్నీషియన్ రమేశ్ రెడ్డి, ఏఎన్ఎంలు, హెల్త్ ప్రొవైడర్లు పాల్గొన్నారు.