Imprisonment
Imprisonment

Imprisonment: నిర్లక్ష్యంగా వాహనం నడిపిన కేసులో ఏడాది జైలు శిక్ష

బాధితుడికి లక్ష రూపాయల పరిహారం
Imprisonment: జగిత్యాల ప్రతినిధి, ఏప్రిల్ 4 (మన బలగం): నిర్లక్ష్యంగా అజాగ్రత్త తో వాహనం నడిపి మూగజీవాల మృతికి, మరికొన్నింటిని గాయపరిచిన కేసులో నిందితుడు డ్రైవర్ సంతోష్ కు ఏడాది జైలు శిక్షతోపాటు ఐదు వేల జరిమానా విధిస్తూ సెకండ్ అడిషనల్ న్యాయ మూర్తి వినీల్ కుమార్ శుక్రవారం తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళితే సారంగాపూర్ మండలం కొనాపూర్ గ్రామానికి చెందిన గొర్రెల కాపరి కసాది చంద్రయ్య 2017 ఫిబ్రవరి 14న తన గొర్రెలను ఇంటికి తరలించుకుంటూ పోతున్నాడు. ఈ సమయంలో సారంగాపూర్ నుంచి వస్తున్న ఆదిలాబాద్ కు చెందిన సంతోష్ అజాగ్రత్తతో, నిర్లక్ష్యం గా క్వాలిస్ వాహనం తో గొర్రెలను డి కొట్టగా 12 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా మరికొన్ని గొర్రెలు గాయాల పాలయ్యాయి. ఈ సంఘటన పై భాధితుడు చంద్రయ్య సారంగాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్ ఐ రణధీర్ కేసు నమోదు చేసుకొని కోర్టుకు సమర్పించగా ఆనాటి నుంచి జరిగిన వాదోప వాదనలు ముగిసిన తరువాత శుక్రవారం న్యాయమూర్తి తీర్పునిచ్చారు. నిందితుడు డ్రైవర్ సంతోష్ కు ఏడాది జైలు శిక్షతోపాటు ఐదు వేల జరిమానా విధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *