DCC President Srihari Rao
DCC President Srihari Rao

DCC President Srihari Rao: నాను మహరాజ్ జాతర మహోత్సవానికి హాజరైన డీసీసీ అధ్యక్షులు

DCC President Srihari Rao: నిర్మల్, జనవరి 16 (మన బలగం): సారంగాపూర్ మండలం బండ్రేవ్ తాండ గ్రామంలో నిర్వహిస్తున్న నాను మహారాజ్ జాతరకు డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు హాజరైనారు. నానూ మహారాజ్ 32వ జయంతి సందర్భంగా జరిగిన మహోత్సవంలో పూజలు చేసి కొబ్బరికాయ కొట్టారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ శ్రీహరి రావుకు బాజా భజంత్రీలతో ఘనస్వాగతం పలికారు. పూజ అనంతరం శ్రీహరి రావును పూల మాలలతో సన్మానించారు. జాతరలో యువకులకు కబడ్డీ పోటీలు నిర్వహించారు. శ్రీహరి రావు పోటీలో పాల్గొననున్న ఆటగాళ్లకు శుభాకాంక్షలు తెలిపి ఆటగాళ్లను అందరిని పరిచయం చేసుకుని కొద్దిసేపు కబడ్డీ పోటీని వీక్షించారు. కబడ్డీ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన జట్టుకు 12000 రూపాయలు బహుమతిగా అందించారు. కారక్రమంలో సారంగాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాదీ, నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీంరెడ్డి, మాజీ జడ్పీటీసీ పతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు బొల్లోజి నర్సయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి మల్లారెడ్డి, పోతరెడ్డి, మాజీ జడ్పీటీసీ రొడ్డమారుతి, దశరథ్ రాజేశ్వర్, నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు ఈటల శ్రీనివాస్, అడెల్లి ఆలయ మాజీ చైర్మన్ శ్రీనివాస్, సాదా ప్రశాంత్, తేజు నాయక్, సత్యపాల్ రెడ్డి, విలాస్, ముఖ్త్యార్, మసీర్, ఎర్రోళ్ల బ్రహ్మం, రాజకుమార్, కొండ శ్రీనివాస్, ముత్యం రెడ్డి, విలాస్ రావ్, రాజు, సుభాష్, అరె చిరంజీవి, కార్వా నవీన్ రెడ్డి, కైలాష్, నగేష్, గజానంద్ దవూజీ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *