Pre-Sankranti celebrations: నిర్మల్, జనవరి 10 (మన బలగం): పండగల ప్రాధాన్యత, సంస్కృతి సాంప్రదాయాలను ముందు తరాలు పాటించే విధంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనపై ఉందని వశిష్ట ఇంపల్స్ పాఠశాల చైర్మన్ గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం వశిష్ట ఇంపల్స్ ఈ టెక్నో స్కూల్ ఆదర్శ్ నగర్లో ముందస్తు సంక్రాంతి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు భోగి పండ్లు పోయడం, గాలిపటాలు ఎగురవేయడం, రంగోలి పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పండుగ ప్రాముఖ్యతను వివరిస్తూ తరతరాలుగా వస్తున్న సంస్కృతి సంప్రదాయాలను ఆచరిస్తూ వాటిని భవిషత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అలాగే రంగోలి పోటీల్లో గెలుపొందిన విజేతలకు పాఠశాల ప్రిన్సిపాల్ గొల్లపల్లి మాధవి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ దేవిదాస్ మరియు ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.