Christmas celebrations: ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 25 (మన బలగం): క్రైస్తవ సోదరులకు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలంలోని పలు చర్చిలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం వేములకుర్తి గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామి టెంపుల్కు ఎస్డీఎఫ్ ద్వారా మూడు లక్షల రూపాయలు కేటాయించి అభివృద్ధి పనులకు ఈరోజు భూమి పూజ చేసారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గూడ శ్రీకాంత్ రెడ్డి ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు దూదిగం గంగాధర్, రెబ్బటి రాజ్ శేఖర్ యాదవ్, ఏఎంసీ చైర్మన్ బోరిగం రాజ, పీసీఎస్ చైర్మన్లు బాస శ్రావణ్, అంకథ్ రాజన్న, ఏఎంసీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచులు గంగాధర్, ఆనంద్ ఎంపీటీసీ కాషిరెడ్డి భాస్కర్ రెడ్డి, ముక్కెర వేణుగోపాల్ యాదవ్, శేఖర్ రెడ్డి, పిప్పిరి అశోక్, తిరుపతి రెడ్డి, మేదిగొండ రమేశ్, సుగునాకర్ రావ్, లక్కం నర్శక్క, బండి రాజేశ్, గుమ్మాల రమేశ్, వెంకటాద్రి, రామానుజం, ముత్తన్న, పెంట లింబాద్రి, పొనకంటి వెంకట్, రావుల గణేశ్ తిరుపతి, సాగర్, యూ ట్యూబ్ రాజు, నిఖిల్, శివ, మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.